Saturday, August 22, 2026
HomeBusinessఅమెరికా సుంకాల దెబ్బతో మార్కెట్లు బోల్తా.. భారీ నష్టం

అమెరికా సుంకాల దెబ్బతో మార్కెట్లు బోల్తా.. భారీ నష్టం

Analyst pointing the chart.

న్యూస్ డెస్క్: అమెరికా సుంకాల ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒత్తిడిలోకి జారుకున్న సూచీలు రోజంతా అదే దారిలో కదిలాయి. మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడంతో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక్కరోజులోనే మదుపరుల సంపద రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.

సెన్సెక్స్ ఉదయం 80,754 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలై, ఒక దశలో 80,013 కనిష్టానికి పడిపోయింది. చివరికి 705 పాయింట్లు కోల్పోయి 80,080 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 211 పాయింట్లు నష్టపోయి 24,500 వద్ద ట్రేడింగ్ ముగించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది.

సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ దిగ్గజాలు, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. అయితే టైటాన్, మారుతీ సుజుకీ, ఎల్&టీ, రిలయన్స్ వంటి షేర్లు మాత్రం లాభాలు సాధించాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.63 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 67.79 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,397 డాలర్లకు చేరుకుంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా వాణిజ్య విధానాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అంతర్జాతీయ బలహీన సంకేతాలే ఈ పతనానికి ప్రధాన కారణాలు. రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ దిశ ఈ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular