
స్పోర్ట్స్ డెస్క్: లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసి తొలిసారి ఐసీసీ టైటిల్ను గెలుచుకుంది. గతంలో ఎన్నో సార్లు సెమీస్, ఫైనల్ దశలలో వెనుకబడి “చోకర్స్” ముద్ర పడిన సఫారీలు, ఈ విజయంలో ఆ ముద్రను తొలగించుకున్నారు.
ఈ విజయంలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ అద్భుత శతకం బడికొట్టింది. రెండో ఇన్నింగ్స్లో 207 బంతుల్లో 136 పరుగులతో అతను జట్టును గెలుపు దిశగా నడిపించాడు. కెప్టెన్ టెంబా బవుమా సహకారం అందించగా, చివర్లో బెడింగ్హామ్, వెర్రెయిన్లు నాటౌట్గా నిలిచారు.
మ్యాచ్ మొత్తం హై వోల్టేజ్గా సాగింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాను 212 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం సఫారీలు 138 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా 74 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లినా, రెండో ఇన్నింగ్స్లో వారు కేవలం 207 పరుగులకే కుప్పకూలారు.
రబడ, ఎంగిడి స్పెషల్ బౌలింగ్తో ఆసీస్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఫలితంగా 285 పరుగుల విజయలక్ష్యంతో సఫారీలు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి అపూర్వ విజయాన్ని అందుకున్నారు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా వందేళ్ల క్రికెట్ చరిత్రలో ఓ స్వర్ణయుగం ప్రారంభమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మార్క్రమ్ నిలిచాడు. ఈ గెలుపుతో సఫారీ జట్టు క్రికెట్లో గౌరవం అందుకుంది.