ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శరీరంలో అసౌకర్యంగా అనిపించడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆమెకు ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది అప్రమత్తమై ఆమెను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేర్పించారు. గత కొన్ని రోజులుగా సోనియాకు ఉదర సంబంధిత సమస్యలు ఉన్నట్లు సమాచారం.
సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ మాట్లాడుతూ “ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స అందుతోంది” అని వెల్లడించారు.
వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన పరీక్షలు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఏ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.