
న్యూస్ డెస్క్: భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించి చారిత్రక ఘట్టాన్ని నెలకొల్పారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా ఆయన తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేశారు.
భూమి నుంచి 28 గంటల ప్రయాణం అనంతరం ఐఎస్ఎస్కి చేరుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యక్తిగా రికార్డు సృష్టించిన శుభాంశు, భారత పతాకాన్ని తన భుజంపై ధరించడం గర్వంగా ఉందన్నారు.
“ఈ ప్రయాణం మొదటి అడుగే, భవిష్యత్తులో మరెన్నో శాస్త్రీయ పరిశోధనలు చేస్తాం” అని తెలిపారు.
తన శరీరంలో కొన్ని మార్పులు అనిపిస్తున్నప్పటికీ, కొన్ని రోజుల్లో అవన్నీ అలవాటవుతాయని చెప్పారు. ఇతర దేశాల వ్యోమగాముల నుంచి అద్భుతమైన స్వాగతం అందిందని, ఇది సొంతింట్లోకి వచ్చినట్లే అనిపించిందన్నారు.
షరతుల ప్రకారం ఐఎస్ఎస్లో 14 రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు చేస్తారు. మిషన్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుభాంశుతో పాటు ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. అమెరికా, హంగరీ, పోలాండ్ దేశాలకు చెందిన వారు ఈ మిషన్లో భాగమయ్యారు.