ఉగ్రవాదంపై పోరాటానికి పాకిస్థాన్ వంటి దేశానికి ఐరాస పదవి ఇవ్వడాన్ని తప్పుబడుతూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక ప్యానెల్కు పాకిస్థాన్ను వైస్ ఛైర్మన్గా నియమించడాన్ని విమర్శించారు.
డెహ్రాడూన్లో జరిగిన సభలో మాట్లాడిన రాజ్నాథ్, 9/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాది పాకిస్థాన్లోనే దాక్కున్నాడని గుర్తు చేస్తూ, అలాంటి దేశానికి పదవి ఇవ్వడం అవమానకరమని అన్నారు. ఇది “పాలకి పిల్లిని కాపలాదారిగా పెట్టినట్టే” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి మోదీ హయాంలో భద్రతా వ్యూహాలు బలపడ్డాయని పేర్కొంటూ, ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ భారత చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన చర్యగా అభివర్ణించారు.
పాకిస్థాన్ను “ఫాదర్ ఆఫ్ టెర్రరిజం” అని ఉద్దేశించి, ఆ దేశం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, నిధులు అందిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్ర మౌలిక వనరుల నిర్మూలనకు అంతర్జాతీయ సమాఖ్య కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఐరాస తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచ భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సమగ్రంగా పోరాడాలంటే ఐరాస నైతిక స్పష్టత అవసరం అని ఆయన హెచ్చరించారు.