
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన నెక్ట్స్ డైరెక్టోరియల్ కోసం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగిస్తున్నారు. ఈసారి ఆయన తమిళ స్టార్ విజయ్ సేతుపతిని కీలక పాత్రలో తీసుకుని భారీ స్థాయిలో చిత్రం రూపొందించబోతున్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేసే పూరికి ఇది మరో విభిన్న ప్రయత్నంగా మారనుంది.
ఈ సినిమా కోసం ఇప్పటికే టబు, దునియా విజయ్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యా బాలన్ కూడా ఈ ప్రాజెక్టులో నటించనున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఆమెకు ఓ పవర్ఫుల్ పాత్రను పూరి రూపొందించాడని చర్చ నడిచింది.
అయితే తాజా సమాచారం ప్రకారం విద్యా బాలన్ ఈ సినిమాలో నటించడంలేదని, ఆమెను చిత్రబృందం సంప్రదించలేదని హిందీ సినిమా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూరి జాగ్రత్తగా కాస్టింగ్ను ఫైనల్ చేస్తుండగా, విద్యా పేరు కేవలం ఊహగానమే అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. టైటిల్, కథ, మిగతా నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయ్ సేతుపతి – పూరి కలయికపై సినీ ప్రేమికుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
Puri Jagannadh, Vijay Sethupathi, Vidya Balan, Telugu Cinema 2025, Puri Next Film,