
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ “ది రాజా సాబ్”పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్పై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
డైరెక్టర్ మారుతీ ఇటీవల “మే మధ్యలో సాలిడ్ అప్డేట్ వస్తుంది” అని హింట్ ఇచ్చిన నేపథ్యంలో, టీజర్ గురించి పాజిటివ్ న్యూస్ బయటకి వచ్చింది. విదేశాల్లో ఉన్న ప్రభాస్ తాజాగా హైదరాబాద్కి తిరిగి చేరుకోవడంతో, టీజర్ డబ్బింగ్ పనులు ప్రారంభించనున్నట్టు సమాచారం.
టీజర్ డబ్బింగ్ పూర్తయిన తర్వాత, మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది సినిమాకు సంబంధించి మరో పెద్ద అప్డేట్ కావడం విశేషం.
టీజర్ విడుదల తరువాత సినిమా రిలీజ్ డేట్ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులు ఇప్పటికే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.