
స్పోర్ట్స్ డెస్క్: ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు భారత టెరిటోరియల్ ఆర్మీ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆయనను గౌరవ లెఫ్టినెంట్ కల్నల్గా నియమించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నియామకం 2025 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని ‘ది గెజిట్ ఆఫ్ ఇండియా’లో స్పష్టం చేశారు.
మిలిటరీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ జీఎస్ చౌధరి విడుదల చేసిన ప్రకటనలో, నీరజ్కు గౌరవ హోదా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్ వంటి క్రీడా దిగ్గజాలకు ఇటువంటి గౌరవాలు లభించాయి.
నీరజ్ 2016లో జేసీఓ హోదాలో సైన్యంలో చేరారు. అర్జున అవార్డు, విశిష్ట సేవా పతకం (VSM), పరమ విశిష్ట సేవా పతకం (PVSM) లాంటి పతకాలు ఆయనను కీర్తిశిఖరాలకు చేర్చాయి. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు పెరిగారు.
ఈ గౌరవంతో నీరజ్ సేవా పురస్కారాల జాబితాలో మరో విలువైన గుర్తింపు చేరింది. భారత సైన్యంలో ఆయన క్రీడా ప్రతిభకు ఇచ్చిన ప్రాధాన్యతగా ఈ గౌరవాన్ని విశ్లేషిస్తున్నారు.