న్యూస్ డెస్క్: జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీప్ఫేక్ కంటెంట్ వల్ల సామాజిక స్థాయిలో వచ్చే నష్టం గురించి స్పష్టంగా వివరించారు.
ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్లో అది ఏఐతో తయారైందనే స్పష్టత ఉండాలని, అందులో వాటర్మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలని ప్రధాని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐను నియంత్రించే సమగ్రమైన పాలనా వ్యవస్థ అవసరమని అన్నారు.
భద్రత, నమ్మకంతో కూడిన సాంకేతికత అందించడమే భారత్ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసేలా టెక్నాలజీ ఉండాలే తప్ప, అపాయంగా మారకూడదని ఆయన హితవు పలికారు.
ప్రపంచ దేశాలన్నీ ఏఐ ప్రయోజనాలను సమానంగా పొందాలన్నదే భారత ఆలోచన అని ప్రధాని తెలిపారు. ప్రజాస్వామ్య బలాలను ఉపయోగించి టెక్నాలజీని అందుబాటులోకి తేనని చెప్పారు.
ఈ సందర్భంలో, సమగ్రమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరిపాలన అవసరమని మోదీ పునరుద్ఘాటించారు. డీప్ఫేక్లపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచానికి జాగ్రత్త చెప్పారు.