
ఏపీ: రాజధాని అమరావతి టెక్నాలజీ హబ్గా రూపుదిద్దుకుంటోంది. దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్, రాష్ట్రంలో రూ. 1,772.08 కోట్ల పెట్టుబడితో 1,200 క్యూబిట్ సామర్థ్యం గల భారీ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ పెట్టుబడి వెనుక సీఎం చంద్రబాబు నాయుడు చొరవ ఉంది. గతంలో ఆయన ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకొచ్చి, నగరాన్ని ఐటీ హబ్గా మార్చారు. ఇప్పుడు అదే సత్సంబంధాలతో, అమరావతికి మైక్రోసాఫ్ట్ను ఆహ్వానించారు.
దేశంలోనే తొలి ‘క్వాంటం కంప్యూటర్ వ్యాలీ’గా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 50 ఎకరాలను సీఆర్డీఏ కేటాయించింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (AQCC) దీన్ని పర్యవేక్షించనుంది.
ఇప్పటికే ఐబీఎం (IBM) సంస్థ 133 క్యూబిట్ కంప్యూటర్ను ఎల్&టీ భాగస్వామ్యంతో ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. ఇది వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభం కానుంది.
ఈ రెండు దిగ్గజాల బాటలోనే, జపాన్కు చెందిన ఫుజిసు (64 క్యూబిట్), విట్ యూనివర్సిటీ (క్యూపై ఏఐ ద్వారా) కూడా క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
ఒకప్పుడు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు క్వాంటం వ్యాలీ రూపంలో అమరావతి అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషించనుంది. ఇది ఏపీకి భారీ బూస్ట్గా నిలవనుంది.
