fbpx
Wednesday, June 18, 2025
HomeAndhra Pradeshపార్టీ కోసం ప్రాణం ఇచ్చిన కార్యకర్తకు అండగా లోకేశ్‌

పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన కార్యకర్తకు అండగా లోకేశ్‌

lokesh-supports-tdp-leader-ballakoti-reddy-family

ఏపీ: టీడీపీ కార్యకర్తలు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తిస్తూ, మంత్రి నారా లోకేశ్‌ మంచితనానికి మరోసారి ఉదాహరణగా నిలిచారు. పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి హత్య తర్వాత వారి కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు.

బాలకోటిరెడ్డి కుటుంబం తీసుకున్న రుణాన్ని పూర్తి చేసి, ఆయన భార్యకు నెలనెలా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇంటి తాకట్టు సమస్యను పరిష్కరించేందుకు మద్దతుగా నిలుస్తూ, కార్యకర్తలకు పెద్దకొడుకులా సేవ చేస్తున్నారు.

బాలకోటిరెడ్డి నిత్యం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అయితే 2019లో వైసీపీ గూండాల చేతిలో కాల్చిచంపబడ్డారు. అప్పటినుంచి వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది.

గత నెలలో కుటుంబాన్ని ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని లోకేశ్‌ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తాము దూరంగా ఉన్నప్పటికీ తాము ఒంటరేమి కాదని భరోసా ఇచ్చారు.

పార్టీ కోసం కష్టపడిన వారిని మరవకూడదనే భావనతో ముందడుగు వేసిన లోకేశ్‌ చర్యలు టీడీపీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

lokesh tdp, ballakoti reddy family, palnadu politics, ycp violence, lokesh helping cadre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular