న్యూస్ డెస్క్: చదువు అభిలాషతో అధికారులను వేడుకున్న ఇద్దరు చిన్నారుల సంఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సెంటిమెంటల్గా స్పందించారు. నెల్లూరు నగరంలోని వీఆర్ స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే చిన్నారులు తమను బడిలో చేర్చాలని కమిషనర్ను కోరారు.
ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన కథనం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లగా, వెంటనే ఆయన స్పందించారు. “చదువుకోవాలన్న చిన్నారుల తపన నన్నెంతో కదిలించింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడి అధికారులను ఆదేశించాను” అని ఆయన తన ట్వీట్లో తెలిపారు.
విద్యే పేదరికం నుంచి బయటపడేందుకు మార్గమని పేర్కొన్న లోకేశ్, ఈ ఇద్దరు చిన్నారుల కలల్ని నిజం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలైనా అధిగమించవచ్చని ఆయన తెలియజేశారు. వీరి కోసం అవసరమైన సహాయం అందించాలని స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నారు.
లోకేశ్ ఈ సంఘటనపై స్పందిస్తూ ఓ న్యూస్ వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని తన ట్వీట్కు జత చేశారు. దీనిపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
