
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. చిన్ననాటి స్నేహితురాలైన వంశికతో ఆయన నిశ్చితార్థం బుధవారం లక్నోలో జరిగింది.
ఈ కార్యక్రమం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. రింకూ సింగ్ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు. వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వంశిక లక్నోకు చెందిన శ్యామ్నగర్ నివాసి. ప్రస్తుతం ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తోంది. ఇక కుల్దీప్తో చిన్ననాటి నుంచి స్నేహబంధాన్ని కొనసాగించారు.
ఈ బంధం కాలక్రమంలో ప్రేమగా మారగా, ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి తేదీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ జంటపై అభినందనల వర్షం కురుస్తోంది. అభిమానులు, క్రికెట్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యువజంటకు కొత్త జీవితానికి శుభాకాంక్షలు.