తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి ప్రధాన చర్చగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై సిట్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు హాజరవగా, కేటీఆర్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ అభిప్రాయం ప్రకారం, కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును విదేశాల్లో నిర్మించిఉంటే ప్రపంచమే గుర్తించేదని తెలిపారు. కానీ భారత్లో కాంగ్రెస్, బీజేపీలు దీనిని రాజకీయ వేదికగా మార్చేసాయని ఆరోపించారు.
“కాళేశ్వరం నిర్మాణం ఒక్కరికి చెందినది కాదు, మంత్రివర్గం ఆమోదంతో, విధానపరమైన నిర్ణయంగా నిర్మించాం. అధికారులు, వ్యవస్థలు కలిసి నెరవేర్చాయి” అని వివరించారు.
అవకతవకల ఆరోపణలు తప్పుడు వేనని, అసత్య ఆరోపణలతో దర్యాప్తులు పెట్టడం బాధాకరమని మండిపడ్డారు. హరీశ్ రావు సిట్ ఎదుట అన్నీ వివరించారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. మేనేజ్మెంట్ పాయింట్తో సీఎం రేవంత్ మోదీ దృష్టిలో పడే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు.