
న్యూస్ డెస్క్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రజాసేవ కోసమే 53 ఏళ్లకే తన ఐపీఎస్ సర్వీస్కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి, 2.8 లక్షలకు పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు.
అయితే, ఆ ఓటమి తర్వాత ఆయన జనసేనకు రాజీనామా చేశారు. 2024 ఎన్నికలకు ముందు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో సొంత పార్టీని స్థాపించి, విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సొంత పార్టీ ప్రయోగం ఫలించలేదు.
ఈ రెండు వైఫల్యాలు ఎదురైనా, జేడీ తన అసలు లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనేదే ఆయన పట్టుదలగా కనిపిస్తోంది.
అందుకే, ప్రస్తుతం ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం వంటి స్థానిక అంశాలపై దృష్టి పెడుతూనే, ఏ ప్రధాన రాజకీయ పార్టీని విమర్శించకుండా తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు.
దీన్నిబట్టి, సొంత పార్టీ ప్రయోగానికి స్వస్తి చెప్పి, 2029 లక్ష్య ఛేదన కోసం ఏదో ఒక బలమైన జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలో చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆయన తదుపరి అడుగు ఎటువైపు పడుతుంది? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన ఏ పార్టీని ఎంచుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.
