
ఏపీ: పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన విషాదంగా మారింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రజలలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఈ ఉదయం జగన్ కాన్వాయ్ ఏటుకూరు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా, తీవ్ర గాయాల కారణంగా ఆయన మృతి చెందారు. ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించారు.
ఇక మరోవైపు సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహం తీవ్రంగా మారింది. తోపులాటలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా ఊపిరాడక కుప్పకూలిపోయారు.
వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే జయవర్ధన్ రెడ్డి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఒక్క రోజులో జరిగిన ఈ రెండు ప్రాణనష్ట ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరింత జాగ్రత్తగా పర్యటనలు నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.