fbpx
Sunday, June 8, 2025
HomeSportsపంజాబ్ vs ఢిల్లీ: మళ్లీ మొదటి బంతి నుంచి మ్యాచ్ రీషెడ్యూల్!

పంజాబ్ vs ఢిల్లీ: మళ్లీ మొదటి బంతి నుంచి మ్యాచ్ రీషెడ్యూల్!

ipl2025-punjab-delhi-match-rescheduled

స్పోర్ట్స్ డెస్క్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలతో మే 8న ధర్మశాలలో ఆగిపోయిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను బీసీసీఐ మళ్లీ నిర్వహించనుంది. తాజాగా షెడ్యూల్ ప్రకారం, ఈ మ్యాచ్‌ను మే 24న జైపూర్‌లో పూర్తిగా కొత్తగా ప్రారంభించనున్నారు. 

ధర్మశాలలో ఆగిన సమయానికి పంజాబ్ 122/1తో పటిష్ట స్థితిలో ఉండగా, ఇప్పుడు మొదటి బంతి నుంచి తిరిగి ఆడనుండటంతో ఆ జట్టు అవకాశాలకు చిన్న ప్రతికూలతగా మారింది.

సాధారణంగా మ్యాచ్ ఆగిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. కానీ ఈ మ్యాచ్‌కు ఆ నియమం వర్తించకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొన్నది. 

తాజా షెడ్యూల్‌తో ఆ సందిగ్ధత తొలిగింది. పంజాబ్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ దిశగా పయనిస్తోంది. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం ఒకదానిలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ పక్కా.

బీసీసీఐ ఐపీఎల్‌ను మే 17న తిరిగి ప్రారంభించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. లీగ్ దశ బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ముంబయిలో జరగనుంది.

ప్లే ఆఫ్స్ కోసం షెడ్యూల్ కూడా సిద్ధమైంది. జూన్ 3న ఫైనల్ ఉండగా, ఇతర మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాయి. వేదికలపై అధికారిక ప్రకటన వేయాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular