
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో ముంబయి ఇండియన్స్ను పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44), బెయిర్స్టో (38), నమన్ ధీర్ (37) చక్కటి ఇన్నింగ్స్లు ఆడారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా 2 వికెట్లు తీశాడు.
204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్కి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వధేరా (48), ఇంగ్లిస్ (38) మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి పంజాబ్ లక్ష్యాన్ని చేరింది.
మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమవడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠగా సాగింది. ముంబయి బౌలర్లలో అశ్విని కుమార్ 2 వికెట్లు తీశాడు.
ఈ విజయంలో ఆనందంలో మునిగిపోయిన పంజాబ్… మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అదే వేదికపై టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది.
ipl2025, pbks, mi, shreyasiyer, rcbinfinal,