
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆటగాళ్ల, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేయాల్సి రావడం దీనికి ఉదాహరణ. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ vs ఆర్సీబీ మ్యాచ్ కూడా రద్దయింది. బీసీసీఐ తాజా నిర్ణయంతో అన్ని మ్యాచ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మే 10న ఉప్పల్ వేదికపై జరగాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ vs కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కూడా వాయిదా పడింది. ఈ మ్యాచ్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు యాజమాన్యం డబ్బులు తిరిగి రీఫండ్ చేయనుంది.
ఫ్రాంచైజీలు, అభిమానులు ఈ నిర్ణయంతో నిరాశ చెంది ఉన్నప్పటికీ, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం సమయోచితం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త షెడ్యూల్ ప్రకటించనుంది.