
పహల్గామ్: ఉగ్రదాడి నేపథ్యంలో టర్కీ, అజర్బైజాన్లపై భారత పర్యాటకుల నిరసన వెల్లువెత్తుతోంది. పాకిస్థాన్కు మద్దతు తెలిపిన ఈ దేశాలపై ఆగ్రహంగా భారతీయులు తమ ట్రిప్లను రద్దు చేస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఈ అభిప్రాయం మరింత బలపడింది.
‘మేక్మైట్రిప్’ ప్రకారం, టర్కీ, అజర్బైజాన్లకు బుకింగ్లు 60% తగ్గగా, క్యాన్సిలేషన్లు 250% పెరిగాయి. దేశభక్తి సెంటిమెంట్కు మద్దతుగా ఈ రెండు దేశాలపై ఉన్న అన్ని ప్రమోషన్లు నిలిపివేశారు. ఈజ్మైట్రిప్ కూడా ఇదే బాటలో నడుస్తోంది.
వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయతే ముఖ్యం అంటూ సంస్థలు సూచిస్తున్నాయి. టర్కీని ట్రాన్సిట్ డెస్టినేషన్గా ఉపయోగించేవారికి మాత్రం ఈ ఆంక్ష వర్తించదని తెలిపాయి.
2024లో టర్కీని 3.3 లక్షల మంది భారతీయులు సందర్శించగా, అజర్బైజాన్కి 2.4 లక్షల మందికి పైగా వెళ్లారు. 2023లో భారత పర్యాటకులు టర్కీలో రూ.3,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు.
ఈ పరిణామాలు రెండు దేశాల పర్యాటక ఆదాయంపై ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.