
స్పోర్ట్స్ డెస్క్: గుజరాత్పై అద్భుత విజయంతో ఐపీఎల్ 2025 సీజన్ ముగించిన చెన్నై సూపర్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ ఎంఎస్ ధోనీ, తన రిటైర్మెంట్ గురించి జరుగుతున్న చర్చలకు క్లారిటీ ఇచ్చాడు.
“ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటా” అంటూ ధోనీ చెప్పారు.
తాను తిరిగిరాననే విషయంలో, అలాగే పూర్తిగా వెళ్లిపోతున్నానని కూడా చెప్పలేనని అన్నారు. “ఇప్పుడు రాంచీకి వెళ్లి బైక్ రైడ్స్ ఎంజాయ్ చేస్తాను. ప్రశాంతంగా ఆలోచించి, భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటాను” అని తెలిపారు.
ఈ సీజన్లో మొదట పిచ్ ప్రవర్తనపై సందిగ్ధత ఉన్నప్పటికీ, ఫలితంగా వ్యూహాలు మార్చుకున్నామని ధోనీ వెల్లడించాడు. బ్యాటింగ్ లోపాలు కొంతవరకు ఉండాయని, వాటిని సమీక్షించి మళ్లీ బలంగా తిరిగొస్తామని ధైర్యం చెప్పారు.
రుతురాజ్ గైక్వాడ్పై నమ్మకం వ్యక్తం చేస్తూ, అతను కీలక పాత్ర పోషిస్తున్నాడని ప్రశంసించారు. వయసు విషయాన్ని నవ్వుతూ తక్కువ చేసుకుంటూ, “తనకంటే 25 ఏళ్లు చిన్నవాడిని చూస్తే వయసైపోయిన ఫీలింగ్ వస్తుంది” అన్నారు.
ధోనీ వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ మరోసారి ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ కాదు… మరో సీజన్ ఆశ కూడా మిగిలేలా ఉంది.