ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. బోర్గ్ డ్రెయిర్షుట్జెన్గాస్సే అనే స్కూల్లో ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 10 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాల్పుల్లో మరణించిన వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారని సమాచారం. ఆపై కాల్పులు జరిపిన విద్యార్థి పాఠశాల టాయిలెట్లోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రాజ్ మేయర్ ఎల్కే ఖర్ వెల్లడించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ శబ్ధాలతో ఒక్కసారిగా పాఠశాల పరుపరాలైన ప్రాంతంలో కలకలం రేగింది. వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని స్కూల్ను ఖాళీ చేయించారు.
గాయపడిన వారికి సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్ వద్ద చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సంఘటన అనంతరం ప్రజలందరినీ ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
గ్రాజ్ ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరం. శాంతియుతమైన ఈ నగరంలో జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
austria school shooting, graz student crime, borg dreierschutzengasse, austria education tragedy, international news updates,