
తెలంగాణ: నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు ఎంతో ముఖ్యమైన ఘట్టం సమీపించుకుంది. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభానికి కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభం కానుంది.
జిల్లా రైతులు ఎన్నో సంవత్సరాలుగా పసుపు బోర్డును కోరుతూ పోరాటం చేశారు. తుది విజయంగా కేంద్రం ఈ కార్యాలయాన్ని నిజామాబాద్కు మంజూరు చేయడం గర్వకారణంగా మారింది. ఈ నెల 29వ తేదీకి ఏర్పాట్లు బీజేపీ వర్గాలు వేగంగా పూర్తిచేస్తున్నాయి.
అమిత్ షా మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్కు వెళ్లి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజల సమీకరణకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభం ద్వారా రైతులకు మార్కెటింగ్, ఎగుమతులలో మెరుగైన మద్దతు లభించనుంది. రైతుల ఆత్మవిశ్వాసం మరింత పెరగనుంది.
ఇది బీజేపీకి రాష్ట్రంలో రాజకీయంగా కూడా శక్తినివ్వగలదనే అంచనా ఉంది. పసుపు బోర్డు కల సాకారం కావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.