
‘పుష్ప 2’ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న AA22 సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను పెంచుతోంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్తో రూపొందుతుండడం విశేషం. ఇది మహేష్ రాజమౌళి సినిమా తర్వాత రెండో ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది.
ఈ సినిమా కోసం బన్నీ హాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సారథ్యంలో ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, భారీ విఎఫ్ఎక్స్ వర్క్తో పారలల్ యూనివర్స్ నేపథ్యంలో కథ నడవనుందని సమాచారం.
తాజాగా ఈ సినిమాలో బ్రదర్స్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుందని టాక్. అల్లు అర్జున్ ఇందులో ట్రిపుల్ రోల్లో, రెండు పాత్రలు ట్విన్ బ్రదర్స్గా ఉండనున్నాయని సమాచారం. ఒకరు మాఫియా గ్యాంగ్స్టర్, మరొకరు వారియర్ పాత్రలలో కనిపించనున్నాడని సినీవర్గాల టాక్.
బన్నీ మూడు వేర్వేరు లుక్స్తో, ప్రత్యేకమైన హెయిర్స్టైల్లు, డిఫరెంట్ మేనరిజంలతో కనిపించనున్నాడు. ‘జై లవకుస’ తరహాలో బ్రదర్స్ ఎమోషన్ నడిపేలా కథ సాగుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
జూన్ 2025లో షూటింగ్ మొదలవనుంది. ఈ చిత్రం భారతీయ విలువలతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.