
ఏపీ: రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు గురువారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి తీర ప్రాంత అభివృద్ధికి ఇది ఒక ముఖ్య ఘట్టంగా పేర్కొనబడుతోంది.
రూ.375 కోట్ల నిధులతో కేంద్రం సమకూర్చిన ఈ ప్రాజెక్టు పర్యాటక విభాగం ఆధ్వర్యంలో అమలుకానుంది. షెకావత్, పవన్ కల్యాణ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీను పరిశీలించారు. రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టు స్థలాన్ని సైతం వీక్షించారు.
ఈ ప్రాజెక్టు పూర్తిైతే ప్రాంతీయ పర్యాటక రంగానికి పెద్ద బూస్ట్ లభిస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వేడుకలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనివల్ల రాజమండ్రి నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేనుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రాజెక్టు పూర్తయిన తరువాత రాజమండ్రి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.