
న్యూస్ డెస్క్: గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. టేకాఫ్ అనంతరం ఇంధన స్విచ్లు పని చేయకపోవడం వల్ల రెండు ఇంజిన్లు ఆగిపోయాయని వివరించింది.
ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, కింద ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణల్లో సమస్య తేలినట్టు నివేదిక పేర్కొంది.
అయితే ఈ నివేదికపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నివేదిక పైలట్లను తప్పుదోవ పట్టిస్తోందని, తక్షణమే సాంకేతిక దోషాలపై దృష్టి పెట్టాలని కోరింది.
ఈ ప్రమాదం అనంతరం డీజీసీఏ, అన్ని బోయింగ్ 787 విమానాలపై జులై 21 వరకు ఇంధన స్విచ్ల తనిఖీ జరపాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా ఇప్పటికే తన విమానాల తనిఖీ పూర్తయిందని ప్రకటించింది.
ఈ కేసులో తుది నివేదిక 2026 జూన్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు తాత్కాలిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
