గుజరాత్: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి 241 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే అద్భుతంగా బతికిపోయారు.
ఘటనాస్థలంలో భారీ గాలింపు తర్వాత బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రమాదానికి ముందు పైలట్లు “మేడే” సిగ్నల్ పంపినట్టు తెలిసింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే విమానం కూలిపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బ్లాక్ బాక్స్లో ఉన్న వాయిస్ రికార్డింగ్, ఫ్లైట్ డేటా విశ్లేషణ ద్వారా సాంకేతిక లోపాలా? మానవ తప్పిదమా? అన్నది తేలనుంది. దీనిపై అధికారిక నివేదిక కోసం దేశం మొత్తం వేచి చూస్తోంది.