
టాలీవుడ్లో ఘట్టమనేని వారసత్వం కొనసాగుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్రసీమలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ యువ హీరోను ‘RX100’, ‘మహా సముద్రం’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేయనున్నాడు.
ఇది యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉండనుంది. ఈ ప్రాజెక్ట్కి రెండు టాప్ ప్రొడక్షన్ హౌస్లు.. వైజయంతీ మూవీస్ మరియు ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం.
ఈ బ్యానర్లపై ఉన్న నమ్మకంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జయకృష్ణ ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్నాడు, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్తో రెడీ అయ్యాడు.
మహేష్ బాబు కూడా ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారని, పర్సనల్గా కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్టు టాక్. స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని, షూటింగ్ జూన్ రెండో వారంలో మొదలవుతుందని సమాచారం.
అజయ్ భూపతి మార్క్ కథ, సంభాషణలతో జయకృష్ణ స్ట్రాంగ్ లాంచ్కి రెడీ అయ్యాడని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చే మరో మాస్ హీరోగా నిలవొచ్చని అంచనా.