fbpx
Sunday, June 8, 2025
HomeBig StoryGT దెబ్బకు... 10 వికెట్ల తేడాతో దిల్లీ చిత్తు!

GT దెబ్బకు… 10 వికెట్ల తేడాతో దిల్లీ చిత్తు!

gujarat-titans-crush-delhi-ipl2025-playoffs

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ (GT) అద్భుత విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25) సహకరించగా, గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.

అయితే 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఓపెనర్లు ఒక్క వికెట్ కోల్పోకుండా 19 ఓవర్లలోనే ఛేదించారు. సాయి సుదర్శన్ 108 (61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్‌మన్ గిల్ 93 (53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు)తో విధ్వంసం సృష్టించారు.

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా, దిల్లీ నాకౌట్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. చివరి రెండు మ్యాచుల్లో విజయమే ఒక్కటే దిల్లీకి తుది ఆశ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular