
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన SSMB29 కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి పనిచేస్తున్నాడు.
పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పటికే జోరుగా కొనసాగుతోంది. అభిమానులు అయితే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో తన తదుపరి సినిమా చేస్తాడా అనే ఆసక్తి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తాజా టాక్ ప్రకారం, మహేష్ బాబు ‘‘పెద్ది’’ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలసి పనిచేయబోతున్నాడట.
గతంలో ఒక సమావేశంలో బుచ్చిబాబుకు మహేష్ ఓపెన్గా ‘‘కథ ఉంటే చెప్పు, చేద్దాం’’ అని మాట ఇచ్చినట్లు వినిపిస్తోంది. ‘‘పెద్ది’’ సినిమా తర్వాత బుచ్చిబాబు పూర్తిగా మహేష్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
mahesh babu, ss rajamouli, ssmb29, bucchi babu sana, pedhdi movie,