fbpx
Sunday, June 22, 2025
HomeSportsవిమర్శలపై గంభీర్ ఘాటు సమాధానం

విమర్శలపై గంభీర్ ఘాటు సమాధానం

gambhir-slams-commentators-india-coach

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ స్టైల్‌పై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. తన విధానంపై కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దేశం గర్వపడేలా చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. కొద్ది మంది వ్యక్తులను సంతోషపెట్టడం కాదు, నా బాధ్యత దేశానికీ సేవ చేయడమేనని అన్నారు.

“ఎప్పుడో ఆట ఆడిన, ఇప్పుడు ఏసీ గదుల్లో కూర్చునే కొందరు భారత క్రికెట్‌ను తమ ఆస్తిలా భావిస్తున్నారు. కానీ ఇది వారి కుటుంబ జాగీరు కాదు. ఇది భారత ప్రజలదే” అని గంభీర్ వ్యాఖ్యానించాడు. తనపై వస్తున్న ఆరోపణలు అనవసరమని, తన పన్నులన్నీ భారతదేశంలోనే చెల్లిస్తానని స్పష్టం చేశాడు.

2011 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన గంభీర్, తన ప్రైజ్ మనీపై విమర్శలు చేసిన వారిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘వీళ్లు డబ్బు సంపాదించేందుకు ఎన్నారైలుగా మారతారు, కానీ నేను ఇక్కడే ఉంటాను,’’ అన్నారు. “నేను రాజకీయ లాబీలకు చెందిన కోచ్‌ను కాను. దేశ గౌరవం కోసం పని చేసే జట్టును నిర్మించడమే నా లక్ష్యం” అని గంభీర్ తేల్చిచెప్పాడు.

gautam gambhir, team india coach, cricket controversy, commentator criticism, indian cricket news,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular