
జూన్ 5న రిలీజ్కు సిద్ధమవుతోన్న థగ్ లైఫ్ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ ఉంది. కమల్ హాసన్, మణిరత్నం 38 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ప్రాజెక్ట్ కావడం సినిమా స్పెషాలిటీ. సింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్తో మరింత హైప్ను తెచ్చుకుంది.
మణిరత్నం మాట్లాడుతూ, “కమల్ అడిగితే కాదనలేను. అద్భుత నటుడితో పని చేయడం ఎప్పుడూ గొప్ప అనుభవం” అని వ్యాఖ్యానించారు. కమల్ హాసన్ మాత్రం భావోద్వేగంతో స్పందిస్తూ, “నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది తెలుగు వారే. మీరు చూపిన ప్రేమే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది,” అన్నారు.
తాను నటించిన పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుందని, ఈ సినిమా నాయకుడు కన్నా గొప్ప విజయాన్ని అందుకోవాలని కమల్ ఆకాంక్షించారు. సినిమా ఎమోషనల్గా బలంగా ఉంటుందని తెలిపారు.
సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ, ఇప్పటికే సినిమా చూసానని, కమల్ పాత్ర అద్భుతంగా ఉందని చెప్పారు. సినిమా తెలుగు వెర్షన్ను శ్రేష్ఠ మూవీస్ విడుదల చేస్తోంది. ఇక బాక్సాఫీస్ దగ్గర కమల్ – మణిరత్నం మ్యాజిక్ మరోసారి మిరాకిల్ చేస్తుందా అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.