fbpx
Monday, June 9, 2025
HomeSportsటెస్టులకు ఐసీసీ భారీ గౌరవం.. WTC ఫైనల్‌కి రికార్డ్ ప్రైజ్‌మనీ..

టెస్టులకు ఐసీసీ భారీ గౌరవం.. WTC ఫైనల్‌కి రికార్డ్ ప్రైజ్‌మనీ..

wtc-final-2025-prize-money-record

స్పోర్ట్స్ డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు ముందు ఐసీసీ సంచలన ప్రకటన చేసింది. టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈసారి ప్రైజ్‌మనీని గతానికి రెండింతలు పెంచింది. 

జూన్ 11 నుంచి లండన్ లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఫైనల్‌లో విజేతకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30.79 కోట్లు), రన్నరప్‌కు 2.1 మిలియన్ డాలర్లు (రూ. 17.96 కోట్లు) ఇవ్వనుంది.

2023లో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు అప్పట్లో కేవలం 1.6 మిలియన్ డాలర్లు (రూ. 13.68 కోట్లు) మాత్రమే అందింది. ఈసారి ప్రైజ్‌మనీ భారీగా పెరగడంతో ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికా ఈసారి లీగ్‌స్టేజ్‌లో 69.44 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ 67.54 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ, “ఇది రెండు సంవత్సరాల కృషికి ఫలితంగా వచ్చిన అవకాశం” అని పేర్కొన్నాడు. మరోవైపు సఫారీ కెప్టెన్ టెంబా బావుమా టెస్ట్ ఫార్మాట్‌కు ఇది ఊతమని అన్నారు.

లార్డ్స్ వేదికగా ఫైనల్ ఉండటం తమకు ప్రత్యేకంగా భావిస్తున్నామన్నారు. టెస్టులకు మరింత గౌరవం తీసుకువచ్చే ఈ ఫైనల్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular