
స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘వార్-2’ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్ కలిసి నటించడం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.
ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారని టాక్. ఈ వేడుకలో ఎన్టీఆర్ ముఖ్యంగా పాల్గొనబోతున్నాడని, హృతిక్ రోషన్ కూడా ఈ ఈవెంట్కు హాజరవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఈవెంట్ను ఆగస్టు రెండో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ-రిలీజ్ వేడుక ద్వారా సినిమాపై మరింత క్రేజ్ పెరగనుంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే టీజర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ‘వార్-2’ను ఆగస్టు 14న భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.