
న్యూస్ డెస్క్: ఇరాన్ అణు కార్యక్రమం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, అణు ఒప్పందం అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
“ఇరాన్ అణుబాంబు కలిగి ఉండరాదు” అంటూ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలతో సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ట్రంప్, “ఒప్పందం చేసుకోండి, ఆలస్యం కాకముందే పూర్తి చేయండి” అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ వద్ద అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్నాయంటూ సూచించారు.
ఇరాన్కు గతంలో ఎన్నో ఛాన్స్లు ఇచ్చినట్లు తెలిపారు. అయినా వారు ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
ఇరాన్పై కఠిన వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని, లేకపోతే భవిష్యత్ మరింత దిగజారుతుందన్నట్లు హెచ్చరించారు ట్రంప్.