
త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తోంది. ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ తర్వాత ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్. త్రివిక్రమ్ స్టైల్ హ్యూమర్, ఎమోషన్ మిక్స్తో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ హిట్ సినిమా ‘సప్త సగరదాచలో’తో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి, వెంకటేష్ సరసన క్లీన్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్.
వెంకీకి తగిన జోడీగా రుక్మిణి కొత్త ఫీలుగా అనిపించవచ్చన్నది మేకర్స్ ఉద్దేశం. ఆమె పాత్రకు మంచి డెప్త్ ఉండేలా స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, రుక్మిణి ఎంపిక ఈ ప్రాజెక్ట్కు కొత్త హైప్ తీసుకొస్తుందన్నది ఇండస్ట్రీ అభిప్రాయం.
trivikram, venkatesh, rukmini vasanth, tollywood, new movie,