
భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి, సరిహద్దు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులకు సహాయం అందించనుంది.
సరిహద్దు సమీప ప్రాంతాల్లో ఉన్నవారు ఎలాంటి సహాయం కావాలన్నా నిర్భయంగా కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ముఖ్య కంట్రోల్ రూమ్ నంబర్: 011-23380556 అని వెల్లడించారు.
అదనంగా, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ (లైజన్ హెడ్): 98719-99044, వ్యక్తిగత సహాయకుడు: 99713-87500, లైజన్ ఆఫీసర్: 96437-23157, పీఆర్వో: 99493-51270 వంటి నంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తెలంగాణ ప్రజలకు అవసరమైన సమాచారం, అత్యవసర సహాయం చేరవేయడం ప్రధాన లక్ష్యం. సరిహద్దు పరిసర ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కడైనా చిక్కుకుపోయినా తక్షణ సహాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుత క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ఏర్పాట్లు ప్రజల్లో భద్రతా భరోసాను కలిగిస్తున్నాయి. ప్రజలు ఈ సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు.