
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక విధానాలతో దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. రెపో రేటును 5.50 శాతానికి తగ్గించడమే ప్రధాన కారణం.
బీఎస్ఈ సెన్సెక్స్ 746.95 పాయింట్లు లాభపడి 82,188.99 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 252.15 పాయింట్లు పెరిగి 25,003.05 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ రంగ షేర్లు ర్యాలీకి ముందుండగా, నిఫ్టీ బ్యాంక్ 56,578.40 వద్ద ముగిసింది.
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 – 59,010.30 వద్ద, స్మాల్క్యాప్ 100 – 18,582.45 వద్ద ముగిశాయి. నిఫ్టీ 25,000 పైన ముగియడం మార్కెట్కి కొత్త ఊపునిచ్చిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ బజూకా పాలసీ మార్కెట్ విశ్వాసాన్ని పెంచిందని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన రూపక్ దే పేర్కొన్నారు. మార్కెట్ ఈ స్థాయిని బ్రేక్ చేసి మరింత ముందుకు పోతుందని తెలిపారు.
వడ్డీ రేట్ల కోత, సీఆర్ఆర్ తగ్గింపు వల్ల ద్రవ్య లభ్యత పెరుగుతుందని, పెట్టుబడులకు ఊతమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటో, కన్జ్యూమర్ రంగాల్లో మదుపర్ల ఆసక్తి పెరుగుతుంది.