
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 30 శాతం పూర్తయిందని, ‘రంగస్థలం’ కన్నా ఇది పెద్దదై ఉంటుందని రామ్ చరణ్ స్వయంగా పేర్కొనడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
తాజాగా లండన్లో తన మైనపు విగ్రహ ఆవిష్కరణకు హాజరైన చరణ్, అక్కడి అభిమానులతో చిట్చాట్ సందర్భంగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ మాటల్లోనే వచ్చిన ఈ కాన్ఫిడెన్స్కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో “పెద్ది బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది” అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది.
విభిన్నమైన కథ, విలక్షణమైన విలేజ్ బ్యాక్డ్రాప్, స్ట్రాంగ్ ఎమోషన్స్తో ‘పెద్ది’ మరొక మైలురాయిగా నిలవనుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 2025 సమ్మర్కు ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.