
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ఎన్సీ24 (NC24) సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చైతూ కెరీర్లో ఇది 24వ సినిమా కావడంతో ప్రాజెక్ట్పై ప్రత్యేక ఫోకస్ ఉంది. కాగా, ఇదే సమయంలో మరో సినిమా విషయంలో ఆసక్తికర మార్పు జరిగింది.
కొత్త దర్శకుడు కిషోర్ చెప్పిన కథను నాగచైతన్య మొదట అంగీకరించినట్టు సమాచారం. బాహుబలి ఫేం ఆర్కా మీడియా ఈ సినిమాను నిర్మించబోతుండగా, రానా సమర్పకుడిగా వ్యవహరించనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, కొన్ని అనివార్య కారణాల వల్ల చైతూ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.
దీంతో దర్శకుడు కిషోర్ ఇదే కథను ఎనర్జిటిక్ స్టార్ రామ్కు నేరేట్ చేశారని టాక్. కథ విని రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం తుది చర్చలు జరుగుతున్నాయి. మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఇటీవల రామ్ హీరోగా వస్తున్న ఆంధ్రా కింగ్ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజై బజ్ క్రియేట్ చేసింది. ఆ మూవీ పూర్తి తర్వాతే కిషోర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది.
ఇలా ఒక కథ రెండు యువ హీరోల మధ్య షిఫ్ట్ అవుతూ టాలీవుడ్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. మరి రామ్ ఈ ప్రాజెక్ట్ను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
naga chaitanya, ram pothineni, kishore director, nc24 movie, arka media works,