
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీ ‘బెగ్గర్’కు పక్కా ప్రిపరేషన్లలో ఉన్నారు. ఈ సినిమాను విభిన్న కథాంశంతో మలిచేందుకు పూరి ఎటువంటి రాజీకి వెళ్లడం లేదు. ముఖ్యంగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. పూరి తనయుడు ఆకాష్ పూరి కూడా ‘బెగ్గర్’లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఆకాష్ నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఇప్పుడు మరోసారి తండ్రి దర్శకత్వంలో ఆయన కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో హైప్ పెంచుతోంది.
ఈ సినిమాలో టబు, దునియా విజయ్, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుండగా, టెక్నికల్ క్రూ వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. పూరి మాస్ టచ్కు తోడు, సేతుపతి నాచురల్ యాక్టింగ్తో ఈ సినిమా డిఫరెంట్ మూడ్లో తెరకెక్కనుంది.
‘బెగ్గర్’ అనే టైటిల్ను పూరి అండ్ టీమ్ ఇప్పటికే లాక్ చేసినట్టు తెలుస్తోంది. కథకు సరిపోయే ఈ టైటిల్తో మాస్ ఆడియెన్స్ను బాగా ఎట్రాక్ట్ చేయాలనే ఉద్దేశమట.