
ఒబుళాపురం: సంచలనంగా మారిన ఒబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగిన ఈ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశించింది.
ఆయనతో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్, లింగారెడ్డిలకు కూడ అదే శిక్ష ఖరారైంది.
అయితే అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం నిర్దోషులుగా తేలగా, 2022లోనే శ్రీలక్ష్మీని కోర్టు డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఓఎంసీకి అనుమతులు మంజూరైన తీరు, అక్రమ లాభాల స్వాధీనం వంటి అంశాలపై విచారణ జరిగింది.
ఈ కేసులో 219 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు కాగా, 3400కి పైగా పత్రాలు పరిశీలించబడ్డాయి. దేశవ్యాప్తంగా చర్చకు లోనైన ఈ కేసు ఇప్పుడు మరో దశలోకి అడుగుపెట్టింది.
కోర్టు తీర్పుతో రాజకీయ నేతల పాత్ర, పరిపాలనా లోపాలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. శిక్షలు ఖరారైన నిందితులు త్వరలోనే హైకోర్టులో అప్పీల్కు వెళ్లే అవకాశం ఉంది.