
న్యూస్ డెస్క్: భారతదేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2024 జనవరి 20న ఒకే రోజులో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది.
ఈ ప్రత్యేక రోజున “మ్యాడ్ మిలియన్ డే” కార్యక్రమం ద్వారా 4.52 లక్షల ఏజెంట్లు కలిసి 5.88 లక్షల పాలసీలను జారీ చేశారు. బీమా రంగ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో పాలసీలు ఒకే రోజులో విక్రయించబడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మొహంతి పిలుపుతో ప్రతి ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చారు. వారి స్ఫూర్తిదాయక చొరవకు గిన్నిస్ సంస్థ నుంచి అధికారిక గుర్తింపు లభించింది.
ఈ విజయం తమ ఏజెంట్ల అంకితభావం, కష్టానికి ప్రతిఫలమని ఎల్ఐసీ పేర్కొంది. వినియోగదారులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
ఈ అరుదైన ఘనత భారత బీమా రంగానికి గర్వకారణంగా మారింది. LIC మళ్లీ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.