
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ వేదికగా క్రికెట్ అభిమానులను ముగ్ధత చేసిన విరాట్ కోహ్లీ – ఏబీ డివిలియర్స్ జోడీ మైదానంలోనే కాకుండా నిజ జీవితంలోనూ మితృత్వానికి చక్కని ఉదాహరణగా నిలిచింది. తాజాగా విరాట్ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన తరుణంలో డివిలియర్స్ అతని బంధాన్ని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
“విరాట్ నా క్రికెట్ సోదరుడు. మేము మొదట ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు అతని పోటీతత్వం కారణంగా అతన్ని ఇష్టపడలేదు. కానీ ఆర్సీబీలో కలిసిన తర్వాత, అతడి లోతైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను. ఇద్దరం గెలుపు కోసమే బ్రతికే ఆటగాళ్లం,” అని డివిలియర్స్ వ్యాఖ్యానించారు.
ఆర్సీబీలో ఇద్దరూ కలిసి 76 ఇన్నింగ్స్ల్లో 3,123 పరుగులు చేశారు. ఇందులో 10 శతక భాగస్వామ్యాలు ఉండటం విశేషం. కోహ్లీ – డివిలియర్స్ ద్వయం ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జోడీగా రికార్డు నెలకొల్పింది.
ఆర్సీబీలో వారు కలిసిన తర్వాత వారి బంధం బలపడింది. కుటుంబ స్నేహితులుగా మారిపోయిన ఈ ద్వయం, మైదానంలోనూ మైదానం బయటనూ అద్భుత కెమిస్ట్రీని చూపారు.
డివిలియర్స్ భావోద్వేగ వ్యాఖ్యలు మరోసారి వారి స్నేహాన్ని చాటిచెప్పాయి. క్రికెట్ ప్రపంచానికి ఇది చిరస్మరణీయ మిత్రబంధంగా నిలిచింది.
Virat Kohli, ABDVilliers, RCB, IPL Friendship, Cricket Bond,