ఉత్తరాఖండ్: మరో హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ మధ్యలో త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ మధ్యలో అదృశ్యమైంది. కొద్దిసేపటికే అది కూలిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని ఉత్తరాఖండ్ అదనపు డీజీపీ వి. మురుగేశన్ తెలిపారు. వారి ఆచూకీ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భద్రతా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అయితే విపరీతమైన వాతావరణం, దట్టమైన కొండ ప్రాంతం వల్ల సహాయక చర్యలు అంత తేలికగా సాగడం లేదు. దీనితో అధికారులు నిష్కర్షతో ముందుకు సాగుతున్నారు. గాలింపు బృందాలు నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించాయి.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియకపోయినా, ప్రాథమికంగా ఇది వాతావరణ ప్రభావమేనని అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది. సహాయక చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తోంది.
ఈ ఘటన కేదార్నాథ్ యాత్రలో భద్రతపై మరోసారి ప్రశ్నలు కలిగించగా, అధికారుల నుండి మరిన్ని వివరాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.