
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా ఈ సినిమా మరో చిత్రానికి అడ్డు అవుతోందనే టాక్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది.
అందాల నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ఘాటీ ఇప్పటికే పూర్తవ్వగా, ఇప్పటి వరకు రిలీజ్పై ఎలాంటి ప్రకటన లేదు. దీనిపై మేకర్స్ మౌనం పాటిస్తుండటంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
విశ్వంభర మరియు ఘాటీ చిత్రాలను ఒకే బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట మెగాస్టార్ సినిమా మీదే ఫోకస్ పెట్టాలని యువి టీం నిర్ణయించిందట.
విశ్వంభర విడుదల తర్వాతే ఘాటీకి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని, అప్పటిదాకా ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అనుష్క అభిమానుల్లో నిరుత్సాహం పెరిగే అవకాశం ఉంది. ఇక విశ్వంభర రిలీజ్తో పాటు ఘాటీ ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడొస్తుందో చూడాలి!