fbpx
Sunday, June 8, 2025
HomeNationalగాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి రద్దు

గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి రద్దు

gali-janardhan-reddy-disqualification-karnataka-assembly

కర్ణాటక: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి శాసనసభ అనర్హత వేటు పడింది. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు అక్రమ మైనింగ్ కేసులో రెడ్డిని దోషిగా తేల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి విడుదల చేసిన ప్రకటనలో, మే 6 నుంచి ఆయన ఎమ్మెల్యే పదవి రద్దయిందని ప్రకటించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ అనర్హత అమల్లోకి వచ్చింది. రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షను ఎత్తివేసేలా ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చే వరకు ఈ అనర్హత కొనసాగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పును స్వాగతించింది. పార్టీ ఉపాధ్యక్షుడు వి.ఎస్. ఉగ్రప్ప మాట్లాడుతూ, “ఇది అవినీతి నాయకులకు గుణపాఠం” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రెడ్డి బృందం స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వానికి దక్కించుకోవాలని డిమాండ్ చేశారు.

రెడ్డి బృందం అక్రమంగా 29 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించడంతో ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగిందని కోర్టు నిర్ధారించింది. ఈ కేసు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.

గాలి జనార్దన్ రెడ్డి 2024లో తన కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇప్పుడు అనర్హత నిర్ణయం, కర్ణాటక రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular