fbpx
Monday, June 9, 2025
HomeSportsచెన్నై ఓటమిపై హుందాగా స్పందించిన ధోని 

చెన్నై ఓటమిపై హుందాగా స్పందించిన ధోని 

dhoni about csk lost the match

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ ఓటమిపై సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందిస్తూ— ‘‘ఈ ఓటమికి నాదే బాధ్యత’’ అంటూ హుందాగా స్పందన ఇచ్చాడు. అలాగే మరికొన్ని బిగ్ షాట్స్ ఆడి ఉండాల్సింది అంటూ.. అలా చేస్తే చివరలో ఒత్తిడి తగ్గేది అని వివరణ ఇచ్చారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ (62), షెపర్డ్ (14 బంతుల్లో 53), బెథెల్ (55)లు జట్టుకు చక్కటి ప్రారంభాన్ని అందించారు. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై చివరి వరకూ పోరాడింది.

అందులో ముఖ్యంగా 17 ఏళ్ల ఆయుష్ మాత్రే 94 పరుగులు చేసి అదరగొట్టాడు. జడేజా 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా విజయం మాత్రం అందలేకపోయారు. ఆఖరి ఓవర్లో 17 పరుగుల అవసరమైన దశలో ధోనీ సిక్సర్ కొట్టి ఆశలు చిగురించానా, తుది క్షణాల్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం కీలకంగా మారింది.

ధోనీ తర్వాత వచ్చిన దూబే తొలి బంతికే సిక్సర్ కొట్టి ఉత్కంఠను పెంచగా, చివరి బంతుల వరకూ మ్యాచ్ సస్పెన్స్‌ను నింపింది. కానీ యశ్ దయాళ్ కూలగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.

ఈ థ్రిల్లింగ్ పోరులో ధోనీ ఆట ఒత్తిడిలో తప్పిపోయిందని ఒప్పుకుని అభిమాన హృదయాలను గెలుచుకున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular