
2023లో వచ్చిన వాతి (తెలుగులో సార్) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ – వెంకీ అట్లూరి కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుందన్న వార్తలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందని సమాచారం.
వెంకీ అట్లూరి ఇటీవల దుల్కర్ సల్మాన్తో చేసిన లక్కీ భాస్కర్ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఆయన సూర్యతో కలిసి సూర్య 46 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మే 2025లో ప్రారంభమై, 2026 సమ్మర్లో విడుదల కానుంది.
సూర్య 46 పూర్తైన తరువాత వెంకీ అట్లూరి మళ్లీ ధనుష్తో ‘హనెస్ట్ రాజ్’ అనే యాక్షన్ ఎమోషనల్ డ్రామాను చేయనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ టాక్. ఇది 2026 చివరిలో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ సినిమాలో ధనుష్ ఓ సీరియస్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడట. ఇప్పటికే టైట్లను పరిశీలిస్తున్న సితార టీమ్, భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది.
ధనుష్ ప్రస్తుతం నీక్, ఇడ్లీ కడై, కుబేర తదితర చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి కాంబోలో వచ్చే ఈ ప్రాజెక్ట్ కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
dhanush, venkyatluri, honestraj, sitaraentertainments, vathimovie,