
బంగ్లాదేశ్: ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్కు డాకా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశద్రోహం ఆరోపణలపై గత ఏడాది నవంబరులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం జైలు జీవితం నుంచి బయటపడేందుకు తొలిసారి అవకాశం దొరకడం గమనార్హం.
నవంబర్ 25న హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన చిన్మోయ్, బంగ్లాదేశ్ సమ్మిలితో సనాతని జాగరణ్ జోట్ అధికార ప్రతినిధిగా, ఇస్కాన్, జాతీయ హిందూ మహజోత్ వంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు.
శేక్ హసీనా ప్రభుత్వ పతనంతో, మధ్యంతర ప్రభుత్వంగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ పరిపాలనలో మైనారిటీలపై దాడులు పెరిగాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. హిందువుల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపారాలపై దాడులు, బెదిరింపులు తీవ్రతరమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో చిన్మోయ్ కృష్ణ దాస్కు బెయిల్ లభించడం హిందూ మైనారిటీ వర్గానికి ఊరట కలిగించింది. అతని విడుదల కోసం బహుళ హిందూ సంస్థలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కంఠం కలిపిన సంగతి తెలిసిందే.
ఇటీవల బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా నేత యూనస్తో మైనారిటీల భద్రత అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే పలు మార్లు ఆందోళన వ్యక్తం చేసింది.